ఈటీవీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో జబర్దస్త్.. ఈ షో మొదట్లో ఒక ఎపిసోడ్ ఒక యాంకర్ తో వచ్చేది. ఆ తరువాత హాట్ యాంకర్ రష్మితో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా చేస్తూవస్తున్నారు మల్లెమాల యాజమాన్యం. ఎందరో కమెడియన్లకు ఆసరాగా నిలిచింది. రోడ్లు పట్టుకొని తిరిగే చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్లకు అన్నం పెట్టింది ఈ జబర్దస్త్. 


షో విషయానికొస్తే.. మొదటి నుండి రోజా, మెగా బ్రదర్ నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. షో లో కమెడియన్లు చేసే కామెడీ ఒక ఎత్తైతే.. జడ్జీల జడ్జిమెంట్ మరో ఎత్తు. యాంకర్ ఎంటర్ అయినప్పటి నుండి ఒక్కొక్క టీం చేసే స్కిట్లు అన్ని అయ్యేవరకు ఎంతో ఓపికగా భరిస్తూ, ఎవరి కామెడీ ఆ రోజుకు పేలిందో చెప్తూ ఉంటారు. మరో విషయమేంటంటే.. కామెడీ లేకున్నా నవ్వే నాగబాబు, మధ్య మధ్యలో రోజమ్మ సెటైర్లు ఆ షో కి హైప్ తెచ్చి పెడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.  


క్రేజ్ ఎంత  వస్తే ఆ షో అంతగా జనాల్లోకి వెళ్తుంది. నాన్ సింక్ పంచెస్ తో దూసుకుపోతున్న ఆ షో కి గతంలో ఓ సారి ఆ ఇద్దరు పెద్దవాళ్ళైన నాగబాబు, రోజమ్మ దూరమైయ్యారు. దానితో ఆ షో ని నడిపించడం ఈటీవీ కి చాలా కష్టమైంది. వాళ్ళు ఇద్దరు రెండు పార్టీ తరపున ఎన్నికల్లో దిగారు. తమ్ముడికి సపోర్ట్ చేస్తూ బాబు జనసేన నుండి పోటీ చేయగా.. వైసీపీ ఎమ్మెల్యే అయిన రోజా అదే పార్టీలో కొనసాగుతూ వచ్చింది. ఎన్నికల కోసం వారు దూరంగా ఉన్నపుడు ఆ షో కి జడ్జీలుగా కొందరు వ్యవహరించిన కూడా షో హిట్ అవ్వలేదు. 


ఇది ఇలా ఉండగా జబర్దస్త్ లో మల్లి ఇప్పుడు రోజమ్మ కనిపించలేదు. ఈ వారం జరిగే ఎపిసోడ్ ప్రోమోని చుస్తే అది అర్థమవుతుంది. ఆ ప్రోమోలో రోజమ్మ లేకుండా వన్ మ్యాన్ షో గా నాగబాబు మాత్రమే జడ్జీగా వచ్చారు. షో కి మరింత అట్రాక్క్షన్ గా వాల్మీకి టీం ఎంట్రీ ఇస్తుంది. ఇలా రోజా అటు రాజకీయాలను, జబర్దస్త్ ను ఎలా కొనసాగిస్తుంది.  రెండు పడవల ప్రయాణం ఇంకెన్ని రోజులు చేస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: