హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ అటు అక్కినేని ఫ్యాన్స్ కు ఇటు తెలుగు ప్రేక్షకులకు భారీ అంచనాలున్నప్పటికి మంచి కమర్షియల్ సక్సెస్ నుమాతరం ఇవ్వలేక పోయాడు. మొదటి సినిమాతోనే మాస్ మసాలా హిట్ అందుకోవాలనుకుని వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన హలో.. మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా ఫ్లాప్ గానే మిగిలాయి. అయినా ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ తన 4వ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. అల్లు అరవింద్ బ్యానర్ లో అఖిల్ 4వ సినిమా తయారవుతోంది. ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోందని లేటెస్ట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది. 

అఖిల్ 4వ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగానే అఖిల్ 5వ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తాజా సమాచారం. అఖిల్ తో 'హలో' సినిమాని నిర్మించిన అక్కినేని నాగార్జున మరోసారి తన కొడుకుతో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా లేటెస్ట్ న్యూస్. అందులో భాగంగానే అఖిల్ కోసం దర్శకుడు పరుశురామ్ ఒక కథను సిద్దం చేయడం.. ఆ కథకు నాగార్జున, అఖిల్ లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయని తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో అఖిల్ 5వ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. పరుశురామ్ 'గీత గోవిందం' తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. మహేష్ బాబు కూడా ఓకే అన్నట్లుగానే వార్తలు వచ్చాయి. కాని ఇద్దరి కాంబో సెట్ కాలేదు. చర్చల దశలోనే ఆ సినిమా ఆగిపోయింది. దాంతో పరుశురామ్ తర్వాత సినిమాను అఖిల్ తో చేసేందుకు సిద్దం అయ్యాడు. నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా నిర్మిస్తున్నట్లుగా  త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. సూపర్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అఖిల్ కు ఈ రెండు సినిమాలైనా హిట్ ని ఇస్తాయో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: