టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఫోటోగ్రఫీ ని అందిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో సైరా టీమ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం  5గం. 31ని. లకు యూట్యూబ్ లో రిలీజ్ చేసారు సినిమా యూనిట్. 

'ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కాట్టాలిరా శిస్తు' అంటూ మెగాస్టార్ పలికే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక 'స్వతంత్రం కోసం జరుగుతున్న ఈ తొలి యుద్ధంలో నువ్వు గెలవాలి' అంటూ అమితాబ్ చెప్పే బాగుంది. ఇక ట్రైలర్ చివరిలో 'నీ చివరి కోరిక ఏదైనా ఉందా అని బ్రిటిషర్లు అడగగా, గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్' అంటూ మెగాస్టార్ పవర్ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు. డైలాగ్స్ తో పాటు వండర్ఫుల్ విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ తో మొత్తంగా ఈ ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం అత్యద్భుతమైన వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అంతేకాక ట్రైలర్ అదరగొట్టడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు సుదీప్, భోజ్ పురి నటుడు రవి కిషన్, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సైరా మూవీ, రేపు రిలీజ్ తరువాత ఎంతవరకు ఆ హైప్ ని అందుకుంటుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే........!!


మరింత సమాచారం తెలుసుకోండి: