టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడిల కలయికలో రాబోతున్న సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు సరసన తొలిసారి హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. ఛలో, గీత గోవిందం, వంటి సక్సెస్ఫుల్ సినిమాల తరువాత ఆమె అయితేనే ఈ సినిమాలోని క్యారెక్టర్ కు న్యాయం చేయగలదని భావించి, దర్శక నిర్మాతలు ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 

ఆమెతోపాటు కమెడియన్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమాతోనే మళ్ళి సినిమాల్లోకి నటుడిగా వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విజయశాంతి ఒక హాస్టల్ కి వార్డెన్ గా నటిస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఆమె క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉందని, అలానే సినిమాలోని కొన్ని కీలక సీన్స్ ఆమె క్యారెక్టర్ తో ముడి పడి ఉంటాయని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇక కొన్నేళ్ల గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్నప్పటికీ, ఆమె నటనలో జోరు ఏ మాత్రం తగ్గలేదట. 

రేపు సినిమా రిలీజ్ తరువాత ఇది తప్పకుండా ఆమెకు మంచి కం బ్యాక్ సినిమా అవడం ఖాయమని సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సంగీత, మురళి శర్మ, హరితేజ, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, వెన్నెల కిశోర్ పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు .....!!


మరింత సమాచారం తెలుసుకోండి: