గత ఏడాది  ప్రారంభంలో ఛలో తో సూపర్  హిట్ కొట్టడం తో యంగ్ హీరో నాగ శౌర్య  కెరీర్ గాడిలో పడ్డట్లు అనిపించింది.  అయితే అదే సమయం లో  స్టోరీ సెలక్షన్ లో చేసిన తప్పులతో వరుసగా మూడు డిజాస్టర్ లను చవిచూడడంతో ఈ హీరో  కథ మళ్ళీ మొదటికి వచ్చింది.  ఇక ఇటీవల శౌర్య  ఓ కొత్త దర్శకుడి తో సినిమా ను మొదలు పెట్టి  మధ్యలోనే ఆపేశాడు.  ప్రస్తుతం  తనకు ఊహలు గుస గుస లాడే లాంటి హిట్ ఇచ్చిన  దర్శకుడు శ్రీనివాస్ అవసరాలతో  మరో సినిమా చేస్తున్నాడు.  ఈసినిమా తో పాటు ఆయన , తన  హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్  నిర్మాణం లో  ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం లో కూడా నటిస్తున్నాడు. 




ఇక ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా  మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగశౌర్య. అయితే ఈ సారి ఓ లేడీ  డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడు.  నూతన దర్శకురాలు  లక్ష్మి సౌజన్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనుంది.  అక్టోబర్ నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ కానుండగా  వచ్చే ఏడాది మే  లో   సినిమా ను విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు  వెలుబడనున్నాయి.  ఇక ఇటీవల  నాగశౌర్య, ఓ బేబీ సినిమాతో ప్రేక్షకులముందుకు రాగ ..  ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  అయితే అది లేడి ఓరియెంటెడ్ కావడంతో  ఆ విజయం సమంత ఖాతాలోకి వెళ్ళింది.  మరి  ప్రస్తుతం హిట్ కోసం పరితపించి పోతున్న నాగ శౌర్యకు  ఈ మూడు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: