వరుస హిట్లతో మిడిల్ రేంజ్ హీరోలలో స్థానం సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ నటించిన వాల్మీకి సినిమా రేపు విడుదల కాబోతుంది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ రేపు సినిమా విడుదలవుతున్నా ఎందుకో ఈ సినిమాకు ఆశించినంత బజ్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా సూర్య నటించిన బందోబస్త్ సినిమా విడుదల కాబోతుంది. నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు సాయం చేసి వరుణ్ తప్పు చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి వాల్మీకి సినిమాను ముందుగా సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ సాహో సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 15 నుండి ఆగస్టు 30వ తేదీకి మార్చుకోవటంతో వాల్మీకి రిలీజ్ డేట్ సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేశారు. కానీ గ్యాంగ్ లీడర్ మూవీ మేకర్స్ కూడా సెప్టెంబర్ 13వ తేదీనే సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. రెండు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావటం మంచిది కాదని ఇతర నిర్మాతలు చెప్పటంతో వాల్మీకి రిలీజ్ డేట్ 20వ తేదీకి మారింది. 
 
కానీ వాల్మీకి సినిమాకు కేవలం 12 రోజుల గ్యాప్ లో మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి విడుదల కాబోతూ ఉండటంతో మెగా అభిమానులు వాల్మీకి సినిమాపై ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది. సూర్య నటించిన బందోబస్త్ సినిమాను దిల్ రాజు విడుదల చేస్తూ ఉండటంతో వాల్మీకి సినిమాకు థియేటర్లు కూడా ఎక్కువగా దొరకటం లేదని తెలుస్తోంది. రేపు విడుదల కాబోయే వాల్మీకి సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రమే సైరా విడుదలయ్యే లోపు బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశం ఉంది. వాల్మీకి 13వ తేదీనే విడుదలై ఉంటే సినిమాకు లాంగ్ రన్ దొరికే అవకాశం ఉండేది.. 


వాల్మీకి సినిమాకు 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. తమిళ నటుడు అథర్వ, మృణాళిని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం తమిళంలో విడుదలై హిట్టైన జిగర్తాండ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: