నయనతార అంటే లేడీ బాస్.. లేడీ సూపర్ స్టార్.. ఆమెకు నచ్చింది తప్ప మరోటి చేయదు. తెలుగు, తమిళ భాషల్లో నయనతారకి పాపులారిటీ ఇంతా, అంత కాదు. ఎందుకంటే ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలతోను .. మరో వైపున స్టార్ డమ్ ఉన్న యువ నటులతో, ఇంకో వైపున వర్ధమాన కథానాయకులతోను సినిమాలు చేయడం, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా మెప్పించడం నయనతార ఉన్న ప్రత్యేకత ఎంతో అని చెప్పాలి. అలాంటి నయనతార చిరంజీవి సరసన 'సైరా' సినిమాలో నటించింది. తమిళంలో రజనీ సరసన 'దర్బార్' .. విజయ్ జోడీగా 'బిజిల్' చేస్తోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చేస్తోంది. తనకి గల పాపులారిటీని  బట్టి తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోంది నయనతార. ఆమె పారితోషకకమే 4 కోట్ల వరకూ తీసుకొచ్చింది. సౌత్ లో ఈ స్థాయి పారితోషికం తీసుకునే హీరోయిన్ మరొకరు లేనే లేరు. ఈ నేపథ్యంలో నయనతార తన పారితోషికాన్ని మరో 3 కోట్లకి పెంచేసిందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఆమెతో సినిమా చేయాలంటే రూ. 7 కోట్ల వరకు ముట్టజెప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

అలాగే బాలీవుడ్ హీరోయిన్లు కూడా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటారు. కానీ నయనతార మాత్రం దానికి విరుద్ధం. అసలు తను ప్రమోషన్ చేయనని మొహం మీదే చెప్పేస్తుంది. కానీ ఇప్పుడు ఈ పద్దతులు తీసి పక్కనబెడుతుంది నయన్. రెండు భారీ సినిమాల కోసం నయన్ ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి ముందుకొస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సైరా ఫ్రి రీలీజ్ వేడుకకు కూడా హాజరవుతానని తెలిపింది. ఇలా తన కండిషన్స్ ను పక్కన బెట్టిన నయనతారకు రామ్ చరణ్ మరికొంత పైకం ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: