స్వర్ణ కమలం' లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన నటి భానుప్రియ. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, వెంకటేష్, హరికృష్ణ, శోభన్ బాబు వంటి పెద్ద హీరోల సరసన నటించిన ఘనత  ఒక్క భాను ప్రియా దే.. స్టార్ హీరోల నుండి నిన్న మొన్న వచ్చిన ప్రభాస్ లాంటి యువ హీరోలతో కలిసి నటించింది. ఇకపోతే ఈమె తెలుగుతో పాటుగా పలు భాషల్లో కూడా నటించింది. కాగా,  ఈమె పై చెన్నైలో ఓ కేసి నమోదు అయింది. 



వివరాల్లోకి వెళితే.. భానుప్రియపై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న భాను ప్రియా గారు తన ఇంట్లో మైనర్ బాలికలతో పనిచేయించుకుంటున్నారు అనే ఆరోపణలు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది జనవరి నుండి ఒక సమస్యతో సతమతమవుతున్నారు.  అదేంటంటే .. ఆమె, ఆమె సోదరుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని అమ్మాయి దొంగతనం చేసిందని కేసు పెట్టారు. 


దీనితో ఆ పని అమ్మాయి వాళ్ళ అమ్మ కొట్టిపడేసింది. నా కూతురిని ఆమె ఇంట్లో బందించి  హింసిస్తున్నారని ఆమె తిరిగి భాను ప్రియా గారిపై కేసు పెట్టింది. నా కూతురిని ఎలాగైనా రక్షించాలని ఆమె పోలీసులను కోరింది. దీంతో బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న సామర్లకోట పోలీసులు చెన్నై వెళ్లి భానుప్రియను విచారించారు.


ఇకపోతే వీరిద్దరూ పెట్టిన కేసులపై ఎక్కువగానే చర్చలు సాగుతున్నాయి. ఈ ఇస్స్యూ జరిగింది చెన్నైలో కాబట్టి, ఆ కేసుకు చెన్నైలోనే విచారణ చేపడుతున్నారు. దీంతో చెన్నై పోలీసులు భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ముద్దాయిలు గా ఉన్న భాను ప్రియను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: