టాలీవుడ్ లోకి ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్.  ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్.  తన కెరియర్ ప్రారంభం నుంచి స్టార్ డైరెక్టర్స్‌తోనే ఈ హీరో పని చేస్తున్నా కలిసిరాలేదు. మొదటి సినిమా వివివినాయక్, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ తో మంచి విజయం అందుకున్నాడు.

అల్లుడు శీను మినహా ఏ ఒక్క సినిమా కూడా మనోడికి కలిసి రాలేదు. ఈ మద్య రిలీజ్ అయిన ‘రాక్షసుడు’ మంచి హిట్ టాక్ వచ్చింది.  ఇది తమిళ రిమేక్..అయినా తెలుగు లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తీశారు.  అయితే రాక్షకుడు హిట్ కూడా రీమేక్ కావటంతో, బెల్లంకొండకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. సినిమాకు డబ్బులు వచ్చినా తన కెరీర్ కు ఏమీ ఉపయోగపడలేదని భావించి, ఈ సారి చేసే సినిమా తనను మాస్ గా ప్రెజెంట్ చేయాలని భావిస్తున్నాడు. 

టాలీవుడ్ లో మాస్ ఎంట్రటైన్ అంటే హరీష్ శంకర్ గుర్తుకు వస్తాడు..ఇప్పుడు ఈ కుర్ర హీరో హరీష్ శంకర్ పై స్కెచ్ వేశాడు. ఈ మేరకు బెల్లంకొండ సురేష్  వీరిద్దరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టు సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పటిదాకా హరీష్ శంకర్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.   తాజాగా గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  ప్రక్క  డైరెక్టర్ ఓంకార్‌తో సినిమా చేసేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కుతోందని సమాచారం. ఓంకార్ రాజు గారి గది-3 తర్వాత శ్రీనివాస్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అంతే కాదు యాక్షన్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ కూడా బెల్లంకొండతో ఓ మూవీ తీయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. థలో చాలా కొత్తదనం ఉందని తెలుస్తోంది. దీంతో శ్రీనివాస్‌కు ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: