నందమూరి కళ్యాణ్ రామ్ 118 తో మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎలాంటి ఎక్స్‌పరిమెంట్ తో వస్తాడో అనుకునేలోపే మాంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ను ఒకే చేసి అందరిని అట్రాక్ట్ చేశాడు. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సతీశ్ వేగేశ్న తో ప్రస్తుతం కమిటయిన సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమాకి ఒక ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. అదే ఎంత మంచి వాడవురా. గత జూలైలోనే టైటిల్ ని ప్రకటించారు. ఈ టైటిల్ కి తగ్గట్టే కళ్యాణ్ రామ్ పాత్ర ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ మేకోవర్ తో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. 

ఇక ఈ సినిమాలో మెహరీన్.. కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తోంది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లతో మంచి సక్సస్ లో ఉంది మెహరీన్. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఉమేష్ గుప్త- సుభాష్ గుప్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ తో ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ బ్యానర్ కి మొదటి సినిమా కావడంతో ఖర్చుకు వెనకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాని
ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

జులై 31న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తయింది. తణుకు- రాజమండ్రి- హైదరాబాద్- చిక్ మంగుళూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమా కి మేయిన్ హైలెట్ అవనుందని తెలుస్తోంది. సతీష్ వేగేష్న తెరకెక్కించిన గత బ్లాక్ బస్టర్ శతమానం భవతి తరహాలో మిడిల్ క్లాస్ కష్టసుఖాలు.. ప్రేమకథ.. సెంటిమెంట్ వంటి ఆసక్తికరమైన అంశాలు ఆకట్టుకుంటాయని చిత్ర బృందం చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: