తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తర్వాత బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో హడావిడిగా తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున క్యాంపెయిన్ చేసి 2019 ఏపీ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుండి రెండోసారి గా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఏ సినిమా మొదలు పెట్టకుండా ఉన్న బాలకృష్ణ చివరాకరికి కె.ఎస్.రవికుమార్ తమిళ దర్శకుడు కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఒక పక్క రాజకీయాలు చూసుకుంటూ మరోపక్క సినిమా రంగంలో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న బాబు ఈ సినిమాని ఎలాగైనా త్వరగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందట. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఈ సినిమా టీజర్ ను దసరాకు రిలీజ్ చేయనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.


మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. కాగా ఈ సినిమాలో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా… కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివ‌ర‌లో కానీ సంక్రాంతి పండుగకు కానీ రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: