బాలీవుడ్ యంగ్ హీరో  షాహిద్ కపూర్  ఇటీవల  కబీర్ సింగ్ తో  ప్రేక్షకులముందుకు వచ్చి భారీ హిట్ కొట్టాడు.  బ్లాక్ బాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి  రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ  డైరెక్ట్ చేశాడు.  ఒరిజినల్ వెర్షన్ ను కూడా ఆయనే తెరకెక్కించిన  విషయం తెలిసిందే. జూలై లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ  270కోట్ల వసూళ్లను రాబట్టి  ఈఏడాది హిందీ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా  రికార్డు సృష్టించింది. ఈచిత్రంలో  షాహిద్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం ముందు వరకు 20కోట్ల వరకు చార్జ్ చేసిన  షాహిద్,  కబీర్ సింగ్ ఇచ్చిన జోష్ తో  తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసాడు. 



ఈ చిత్రం తరువాత షాహిద్  జెర్సీ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.  ఒరిజినల్ వెర్షన్ లో  నాచురల్ స్టార్ నాని నటించగా  సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు  పొంది మంచి విజయాన్ని సాధించింది.  దాంతో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు  ఓ బాలీవుడ్  బడా  నిర్మాత తో కలిసి  హిందీ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా  ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించడానికి అంగీకరించాడట.  




ఈచిత్రం కోసం షాహిద్ ఏకంగా 35కోట్ల రెమ్యునరేషన్  ను డిమాండ్ చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా  వెల్లడించింది.  ఇక ఈ చిత్రంలో  షాహిద్ కు జోడీగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించనున్నట్లు   వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు  ఈరీమేక్ గురించి అధికారికంగా ఎలాంటి  ప్రకటన వెలుబడలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: