తెలుగు సినిమా రంగంలో అపజయం లేని అతి తక్కువ డైరెక్టర్లలో ఒకరు కొరటాల శివ. ఇప్పటిదాకా దర్శకత్వం వహించిన 4 సినిమాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే హిట్ లు అవటం జరిగాయి. కాగా ఈ నాలుగు సినిమాలకు సంగీతం అందించింది దేవి శ్రీ ప్రసాద్. దీంతో చాలా మంది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మరియు బయట కూడా చాలామంది డైరెక్టర్ కొరటాల కి దేవీశ్రీ ప్రసాద్ సెంటిమెంట్ గా మారిపోయాడు అంటూ కామెంట్లు వినపడ్డాయి. అయితే కొరటాల శివ తర్వాత చేయబోయే చిరంజీవి సినిమాల్లో సెంటిమెంట్ బ్రేక్ చేసినట్లు...చిరంజీవి ప్రాజెక్ట్ కి దేవిశ్రీప్రసాద్ ని పక్కన పెట్టినట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.


బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి తో చేయబోయే ప్రాజెక్ట్ ఏడాది చివరిలో మొదలుకానున్న టు సమాచారం. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవితో చేయబోయే సినిమా విషయంలో తాజాగా ఇటీవల సినిమా నిర్మాత రామ్ చరణ్ తో చర్చలు జరిపిన సందర్భంలో...రామ్ చరణ్ కూడా అమిత్ త్రివేది వైపు మొగ్గుచూపినట్లు టాక్. అయితే ‘సైరా’ రిలీజ్ అయ్యాక రిజల్ట్ అనంతరం ఫైనల్ నిర్ణయం తీసుకొని ప్రకటించాలని చూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ లో ఈ ప్రాజెక్ట్ స్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి మరియు రామ్ చరణ్ ఫోకస్ మొత్తం ‘సైరా’ సినిమా పై పెట్టడం జరిగింది.


అక్టోబర్ రెండవ తారీకున విడుదల కానున్న ‘సైరా’ సినిమా చిరంజీవి కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా అయిన వెంటనే ఈ ఏడాది చివరిలో కొరటాల - చిరంజీవితో చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గిన చిరంజీవి..ఫుల్లుగా వర్కౌట్ అయ్యి ఈ ఏడాది చివరిలో సినిమా షూటింగ్ లో పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: