తెలుగు రాష్ట్రాల్లోబిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ పొందింది.  రెండు సీజ‌న్లు పూర్తి చేసుకుని మూడో సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నాగార్జున హోస్టుగా నిర్వ‌హిస్తున్న ఈ షో...ఆర‌వై రోజులు దాటిపోయింది.  అయితే మాత్రం  షో హోరా హోరీగా సాగింది. అయితే బిగ్‌బాస్‌లో పదోవారానికి గానూ నామినేషన్‌ ప్రక్రియను చేపట్టాడు బిగ్‌బాస్‌. నామినేషన్ ప్ర‌క్రియ‌ను  గత సీజన్స్‌లో కంటే భిన్నంగా చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కన్ఫెషన్‌ రూమ్‌కు దూరంగానే చేప‌ట్టాడు. ఇందులో భాగంగా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్‌బాస్‌. జంట‌లు, జంట‌లుగా విడ‌గొట్టి నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టామ‌న్నాడు బిగ్‌బాస్‌. ఇద్దరిలో బిగ్‌బాస్‌లో టైటిల్ పొంద‌డానికి ఎందుకు అర్హ‌తో చెప్పాల‌ని,  వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే సేవ్‌ అవుతారనే నిబంధ‌న‌లు విధించాడు బిగ్‌బాస్‌.అంతే సంగ‌తి నీకంటే నేను బెస్టంటూ ఒక‌రు, నేనే బెస్టు అంటూ మ‌రొక‌రు ఇలా  ఒక‌రిపై ఒక‌రు వాద‌న‌లు మొద‌లు పెట్టుకున్నారు.


అయితే మొద‌ట‌గా శివజ్యోతి - శ్రీముఖిల మధ్య భీకర మాటల పోరు జరిగింది. ఏడుస్తూ ఉంటావని అదే వీక్‌నెస్‌ అంటూ శ్రీముఖి నామినేట్‌ చేయగా.. ఎదుటి వారి కాన్ఫిడెన్స్‌ను చంపి గేమ్‌ ఆడేదానివంటూ శివజ్యోతి ఫైర్ అయింది. వీరిద్ద‌రిలో ఒక‌రిపై ఒక‌రు మాట‌ల‌తో  యుద్ధం చేసుకున్నారు. దీంతో బిగ్ బాస్ వీరిద్ద‌రి మాట‌ల యుద్దంతో దద్ద‌రిల్లిపోయింది. ఒక ద‌శ‌లో శ్రీ‌ముఖి శివ‌జ్యోతిపై ఫైర్ కాగా, అందుకు త‌గ్గుట్లుగానే శివ‌జ్యోతి కూడా శ్రీ‌ముఖిపై త‌న మాట‌ల‌తో ఇర‌దీసింది.  హోరా హోరీగా జ‌రిగిన వీరి మ‌ధ్య   చివ‌ర‌కు కంటెస్టంట్ అంద‌రూ ఓటింగ్ వేశారు. శ్రీ‌ముఖికి ముగ్గురు ఓటేస్తే , శివ‌జ్యోతికి న‌లుగురు ఓటేశారు. దీంతో అక్క‌డే ఉన్న మిర్చి దండ‌ను శివ‌జ్యోతి శ్రీ‌ముఖికి వేసింది. ఇక అంద‌రి జంట‌ల్లో కూడా ఇలా మామూలుగా మాట‌ల యుద్ధంతో నామినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగింది. చివ‌రిగా ఈ వారం నామినేష‌న్ అయిన వారు శ్రీ‌ముఖి, ర‌వి, బాబా భాస్క‌ర్‌, వ‌రుణ్ సందేశ్‌లు ఉన్నారు. మొత్తం మీద ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ ఇలా ముగించేశాడు బిగ్‌బాస్‌. మ‌రి ఈ వారం ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోతారో ఆదివారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: