సూపర్ స్టార్ రజనీకాంత్ సౌతిండియాలోనే అందరి స్టార్ హీరోస్ కంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరో. రజనీ ఏజ్ పెరుగుతున్నా ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు తగ్గట్టే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో నిర్మాతల నుంచి రెమ్యునిరేషన్ అందుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన పారితోషికంలో తగ్గింది లేదు. ఇక గతంలో తన రెమ్యునరేషన్ గురించి రజనీ మాట్లాడిన ఓ వీడియో లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ స్థాయిలో నేను పే చెక్ లు డిమాండ్ చేస్తున్నానంటే నా మార్కెట్ నాకు తెలుసు. అందుకే డిమాండ్ చేస్తున్నాను అంటూ రజనీ నిర్మొహమాటంగా చేసిన వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

దాదాపు 27 ఏళ్ల క్రితం సురేష్ కృష్ణ రూపొందించిన అన్నామలై సినిమా సక్సెస్ మీట్ కి సంబంధించిన వీడియో క్లిప్ లో ఉన్న దానిని బట్టి ఇండస్ట్రీలోని ఓ వర్గం రజనీ పారితోషికం పై విమర్శలు చేశారట. దాంతో వారికి సమాధానం చెప్పాలన్న ఆలోచనతో అప్పట్లో అలా సంచలన వ్యాఖ్యలు చేశారు రజనీ. ఆ స్థాయిలో నేను డిమాండ్ చేస్తున్నానంటే నా మార్కెట్ ఎంతుందో నాకు తెలుసు కదా? ఆ కారణంగా భారీగా అడుగుతున్నాను. అయితే నా సినిమా వల్ల నష్టం వస్తే దాన్ని భరించడానికి కూడా సిద్దంగా ఉన్నాను. లాభాలొస్తే మాత్రం వాటాలు ఇవ్వమని అడగను.  అడగటం లేదు కూడా. నన్ను నిజాయితీగా వుండనివ్వండి.. మీరూ నిజాయితీగా వుండండి అంటూ రజనీ చెప్పిన మాటలు ఇప్పటికీ వైరల్ కావడం విశేషమే.

మీరు నిజాయితీగా వుంటే నేనూ నిజాయితీగానే వుంటాను. మీరు నిజాయితీగా లేకపోతే..నేనూ నిజాయితీగా వుండను అని రజనీ అంటున్నప్పుడు ఆయన గురువు దర్శకుడు కె.బాలచందర్ అక్కడే వుండటం విశేషం. 69 ఏళ్ల తలైవా ఇప్పటికీ అదే స్టైల్ టోన్ మెయింటైన్ చేయడం ఆశ్చర్యకరమే. అందుకేనేమో ఒక సాధారణ బస్ కండక్టర్ సూపర్ స్టార్ అయ్యారు. ఇక ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దర్బార్... శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: