కొరటాల శివ మరియు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లది మంచి హిట్ కాంబినేషన్ . వీరు కలిసి చేసిన సినిమాలు అన్ని మ్యూజికల్ గా మరియు కమర్షియల్ గా ఘనవిజయాలు సాధించాయి.2011 యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ హీరోగా నటించిన "మిర్చి" సినిమాతో వీరిద్దరి జర్నీ మొదలైంది. మిర్చి సినిమా లోని పాటలు  సూపర్ హిట్ అయ్యాయి. 

ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు అందాల తార శృతి హాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా కి వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రీపిట్ అయ్యింది. శ్రీమంతుడు సినిమా మరియు పాటలు సూపర్ హిట్ కావడంతో వీరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా ముద్ర పడింది.ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు  వచ్చింది.2016 లో  తారక్ సమంత జంటగా వచ్చిన "జనతా గ్యారేజ్ "సినిమా లోని పాటలకు మంచి ఆదరణ వచ్చింది.ఆ తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన  "భరత్ అనే నేను" సినిమాకి వీరిద్దరు  చివరి సారి గా కలిసి పని చేశారు.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  స్ర్కిప్ట్  ఫైనల్ వర్షన్ జరుగుతోందట. దర్శకుడు కొరటాల  ఈ సినిమా  కోసం నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో హిట్ కాంబినేషన్ బ్రేక్ చేయనున్నాడట.   సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది  కొరటాల-మెగాస్టార్  సినిమాకి సంగీతం  అందిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా లో హీరోయిన్ గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ  అఫిషియల్ గా ఎవరు ఫిక్స్ కాలేదు. ఈ సినిమా ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: