డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమా ఇటీవల విడుదల అయి అదిరిపోయే మాస్ హిట్ అందుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా చూసి చాలామంది బయటకు వచ్చిన మెగా అభిమానులు మరో గబ్బర్ సింగ్ లా 'గద్దలకొండ గణేష్' సినిమా ఉందని కామెంట్ చేస్తున్నారు. విపరీతంగా మాస్ ఆడియన్స్ ని ఈ సినిమాతో ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్.


ఇటువంటి నేపథ్యంలో  సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు హరీష్ శంకర్. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ...ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని షూటింగ్ 8:00 అంటే పది నిమిషాలు ముందుగా సెట్ లోకి వచ్చేస్తాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మరియు అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ..చిరంజీవి అంటే కింగ్ ఆఫ్ సినిమా అని.. ఇంకో చిరంజీవి పుడతారని అనుకోనని అన్నారు.


పవన్ కళ్యాణ్ సినిమాలు చేయననటం తనకు నచ్చలేదని చెప్పారు. ఇక విజయ్ దేవరకొండ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ''అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ కి కథ చెప్పాలని ఒకసారి కలుద్దామని మెసేజ్ పెట్టాను. అన్నా.. నేను ఏడాదిన్నర, రెండేళ్ల వరకూ బిజీగా ఉన్నాను. సినిమా టాపిక్ కాకపోతే కలుద్దాం అని మెసేజ్ పెట్టాడు. సినిమా టాపిక్ కాకపోతే నీతో నాకేం పని ఉంటుందని భయ్యా.. ఏడాదిన్నర తరువాతే కలుద్దాం అని నేను రిప్లై ఇచ్చాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: