మూవీ క్రిటిక్ మరియు దర్శకుడైన కత్తి మహేష్, ఇటీవల అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. ఇక కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్, కత్తి మహేష్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు ఆ వివాదం మెల్లగా సర్దుకుంది. ఇక దాని తరువాత హిందువులు ఆరాధ్య దైవం శ్రీరాముడిపై కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కారణంగా కత్తి మహేష్ ను అప్పటి తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగరం నుండి కొన్నాళ్ల పాటు బహిష్కరించడం జరిగింది. అయితే అక్కడి నుండి మాములుగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్న కత్తి మహేష్, 

మధ్యలో మధ్యలో తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికపుడు జరిగే సినీ, రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. ఇకపోతే మొన్న జరిగిన సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, సినిమాలో కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ విభాగంలో పని చేసిన తన డాటర్ సుస్మితను మెచ్చుకుంటూ మెగాస్టార్ పొగడడం జరిగింది. ఆ తరువాత ఆమె కూడా స్టేజిపైకి వచ్చి సైరాలో పని చేసిన తన అనుభవాలు పంచుకున్నారు. అయితే నిజానికి ఆ సినిమాకు సుస్మిత గారితో పాటు మరొక అమ్మాయి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిందని, అయితే మెగాస్టార్ కూడా ఆ విషయమై కేవలం తమ కుమార్తె సుస్మిత గారి గురించి మాత్రమే మాట్లాడడం సబబు కాదని కత్తి మహేష్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సంచలన కామెంట్స్ చేసారు. 

నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై పలువురు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, నిజానికి చిరంజీవి గారు తన కాస్ట్యూమ్స్ విషయమై మాట్లాడిన సమయంలో సుస్మిత గారితో పాటు మరికొంత మంది ఉన్నారు, అలానే ఉత్తర గారి గురించి కూడా చెప్పడం గమనించవచ్చని, అయితే చిరంజీవి గారు ఆ విభాగంలో ప్రధానంగా వ్యవహరించిన సుస్మిత గారిని, ఆ తరువాత మరికొంతమంది అంటూ కూడా ప్రస్తావించారనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. అయితే కత్తి మహేష్ గారి వాదనలో కూడా కొంత న్యాయం ఉందని, తమకు తెలిసినంతవరకు ఇది పెద్ద సమస్యాత్మకమైన విషయం కాదని, తప్పకుండా ప్రతి సినిమా టీమ్ కూడా తమ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుని అటువంటి వారందరికీ మంచి గుర్తింపుని ఇస్తుందని అంటున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: