చిత్ర లహరి ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. అందులో భాగంగా  ప్రస్తుతం ఈ హీరో  మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే  చిత్రంలో నటిస్తున్నాడు.  ఈచిత్రం యొక్క షూటింగ్ తూర్పు గోదావరి లో జరుగుతుంది. అక్టోబర్ లో  షూటింగ్ ను పూర్తి చేసి  క్రిస్మస్ కానుకగా  చిత్రాన్ని ప్రేక్షకులముందుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 



పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.  యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2   సంస్థలు సంస్థలు ఈ చిత్రాన్ని  నిర్మిస్తుండగా ఇటీవల  విడుదలైన ఈ చిత్రంయొక్క ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను తీసుకొచ్చింది.  ప్రముఖ  తమిళ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో  ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు.  దసరా కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు. 



ఇక ఈ చిత్రం తరువాత సాయి ధరమ్ , నూతన దర్శకుడు  సుబ్బు డైరెక్షన్ లో ఓ  చిత్రంలో నటించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు  గా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈచిత్రం లాంచ్ కానుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఈసినిమా తో పాటు సాయి ధరమ్ ..  ప్రస్థానం  ఫేమ్  దేవకట్టా తో కూడా  సినిమా  చేయనున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం  వచ్చే ఏడాది  జనవరి లో ప్రారంభం కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: