పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇటీవల విడుదలైన ఈ చిత్రంయొక్క ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను తీసుకొచ్చింది. ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు.
ఇక ఈ చిత్రం తరువాత సాయి ధరమ్ , నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈచిత్రం లాంచ్ కానుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. ఈసినిమా తో పాటు సాయి ధరమ్ .. ప్రస్థానం ఫేమ్ దేవకట్టా తో కూడా సినిమా చేయనున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లో ప్రారంభం కానుంది.