టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత గాథ ఆధారంగా ప్రస్తుతం తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కు చెందిన పలువురు అగ్ర నటుల కలయికలో మంచి పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, 

కన్నడ వంటి భాషల్లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ నుండి రెండవ వెంచర్ గా రాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు ఒక లిరికల్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. ఇకపోతే రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి, సినిమాకు తనవంతుగా పబ్లిసిటీని అందించారు. ఇకపోతే రాబోయే మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సైరాకు తనవంతుగా సాయం అందించనున్నట్లు కాసేపటి నుండి టాలీవుడ్ వర్గాల్లో వార్తలు విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, 

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, చిరంజీవి మరియు రామ్ చరణ్ తో కలిసి డార్లింగ్ ప్రభాస్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే సైరా నిర్మాత రామ్ చరణ్, ప్రభాస్ ని కలవడం, అందుకు ప్రభాస్ ఎంతో సంతోషంగా ఒప్పుకోవడం జరిగిందని అంటున్నారు. అయితే దీని పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, మెగాఫ్యాన్స్ తో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు కూడా ఇది మంచి పండుగ వార్త అనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: