స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం  అల.. వైకుంఠపురములో .. ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్  జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలకానుందని సమాచారం. అయితే ఈవిడుదలతేది పై అధికారిక ప్రకటన వెలుబడాల్సి వుంది.  ఇటీవల విడుదలైన ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై  అంచనాలు మరింతగా పెరిగాయి.  ఇక  ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను  బ్లూ స్కై  సినిమాస్  8.60కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా ఈచిత్రం  అల్లు అర్జున్ కెరీర్ లో  ఓవర్సీస్  లో  అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం గా రికార్డు  సృష్టించింది. అల్లు అర్జున్ స్టార్ పవర్ కు తోడు  గతంలో త్రివిక్రమ్  డైరెక్ట్ చేసిన అ ఆ , అరవింద సమేత యుఎస్ ప్రేక్షకులను  విపరీతంగా  అలరించాయి. 




దాంతో  డిస్ట్రిబ్యూషన్ సంస్థ  బ్లూ స్కైస్  సినిమాస్  ఈ సినిమా హక్కులకు భారీగా  వెచ్చించింది. మరి ఈ సినిమా తో అల్లు అర్జున్ అక్కడ  భారీ మార్కెట్ ను  ఏర్పరుచుకుంటాడో లేదో చూడాలి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ త్రివిక్రమ్  కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.  ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి  సూపర్ హిట్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: