పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తాడా అని మెగా ఫ్యాన్స్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో మునిగిపోయారు. త్వరలో పవన్ సినిమా చేస్తాడని అంటున్నా అది ఎంతవరకు నిజమన్నది తెలియట్లేదు.


ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో అబ్బాయ్ రాం చరణ్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే పవన్ తో సినిమాకు అడ్వాన్సులు ఇచ్చాడని తెలుస్తుండగా. పవన్ మాత్రం వారికి ఇంకా ఏ విషయం చెప్పలేదట. అయితే ఈలోగా బాబాయ్ తో అబ్బాయి సినిమా షురూ చేస్తున్నట్టు తెలుస్తుంది.


ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ప్రమోషన్స్ లో పవన్ ను ఫుల్లుగా వాడేస్తున్నారు. అంతేకాదు సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఇక పవన్ తో సినిమా కూడా ప్లాన్ చేశాడట రాం చరణ్. చరణ్ నిర్మాణంలో పవర్ స్టార్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ కు అంతకుమించిన సంబరం మరోటి ఉండదని చెప్పొచ్చు.  


ఇక హీరోగా ఫుల్ ఫాం లో ఉన్న రాం చరణ్ నిర్మాతగా మారి సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాడు. చిరుతో ఖైది నంబర్ 150 తీసి హిట్టు కొట్టగా ఇప్పుడు సైరాతో సెన్సేషన్స్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇక పవన్ సినిమా కూడా ఓకే అయితే ఈ కాంబినేషన్ మరో రేంజ్ లో ఉంటుంది. అయితే రాం చరణ్ నిర్మాణంలో పవన్ సినిమాకు డైరక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. ఆ లక్కీ ఛాన్స్ ఎవరందుకుంటారో చూడాలి. ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: