'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' చిత్రం డిసెంబర్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఇటివలే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా కోసం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. కాగా తాజాగా నితిన్ డబ్బింగ్ పూర్తి అయిందట. కాకపోతే మరి కొన్ని సీన్స్ లు బ్యాలెన్స్ ఉన్నాయని.. అవి ఇంకా షూట్ చేయాల్సిన పని ఉందని... మిగిలిన షూటింగ్ కూడా పూర్తయ్యాక నితిన్ ఆ సీన్స్ కి కూడా డబ్బింగ్ చేబుతాడట. ఈ చిత్రానికి 'సింగిల్ ఫరెవర్' అనేది ఉపశీర్షిక. ఇక షూటింగ్ మిగిలిన ఉన్న బ్యాలెన్స్ సీన్స్ లను వచ్చే వారం నుండి షూట్ చేయనున్నారని తెలుస్తోంది. 'ఛలో' మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ప్రజెంట్ తెలుగులో ఉన్న యువ కామెడియన్లలో వెన్నెల కిశోర్ బాగా పాపులర్. ఎలాంటి ఫన్నీ పాత్రనైనా అవలీలగా చేస్తూ హాస్యాన్ని పండించగలగడం వెన్నెల కిశోర్ స్పెషాలిటీ. అందుకే ఆయన కోసం పనిగట్టుకుని మరీ తమ సినిమాల్లో పాత్రలు రాస్తున్నారు దర్శకులు.
ప్రస్తుతం నితిన్ చేసున్న 'భీష్మ'లో కూడా వెన్నెల కిశోర్ అలాంటి పాత్రలోనే నటిస్తున్నాడు. ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. కాగా ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన 'కుమారి 21 ఎఫ్' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది హెబ్బా పటేల్. ఆ సినిమా హిట్ కారణంగా హెబ్బాకు ఆ తరువాత బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వరుస ప్లాప్ లతో ఈ అమ్ముడికి ప్రస్తుతం ఛాన్స్ లు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన సినిమానే 'భీష్మ'. అయితే హెబ్బా పాత్రలో ఎక్కువుగా నెగటివ్ షేడ్స్ ఉంటాయట. మొత్తానికి ఈ సినిమాలో హెబ్బా లేడీ విలన్ గా నటిస్తోంది. మరి హెబ్బాకి ఈ చిత్రంతోనైనా ఆమె ఆశించిన బ్రేక్ ఆమెకు దక్కుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.