వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసే చిత్రవిచిత్రమైన చిత్రాలతో మరియు ఎన్నో అర్థంకాని వ్యాఖ్యలు చేసే ఇంటర్వ్యూలతో ఎప్పుడు చూసినా జనాల మధ్య బాగా పాపులారిటీ పెంచుకుంటాడు. అప్పుడెప్పుడో కడప పైన ఒక వెబ్ సిరీస్ తీస్తానన్న రామ్ గోపాల్ వర్మ ఆపై వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే అంతకు మించిన కాంట్రవర్సీ తో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అబ్బురపరిచాడు. వైలెన్స్, హారర్ జోనల్ నుంచి రాజకీయ జోనల్ మీద చిత్రాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు.

నిన్ననే చంద్రబాబు పైన ఒక పాటను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందే ఆ చిత్రంలోని పూర్తి కంటెంట్ ను ఉద్దేశించి మరొక పాట ను కూడా విడుదల చేశాడు. అయితే జర్నలిస్టు మూర్తి తో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మూర్తి అతనిని మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఎలా వచ్చిం...ది అసలు ఎందుకు ఉంది అని ప్రశ్నించగా రామ్ గోపాల్ వర్మ తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పనని… ఇప్పుడు కూడా తనకు కుల పిచ్చి ఉండొచ్చు ఒప్పుకున్నానని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. 

అయితే మూర్తి… మీకు అంత కులపిచ్చి ఉన్నప్పుడు మీరు రాజు కులానికి చెందిన వారు కాబట్టి రాజుల పైన సినిమా తీయకుండా కమ్మ వారి పైన... రెడ్డిల పైన సినిమా ఎందుకు తీశారు అని ప్రశ్నించాడు. అందుకు రామ్ గోపాల్ వర్మ తనకు కుల పిచ్చి ఉంది తన కులం పైన కాదని… కమ్మ వారంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. అసలు రాజు కులానికి చెందినవారు రాజులు కాదని కమ్మవారే అసలైన రాజులని... వారి యాస కూడా దానికి తగ్గట్టు రాచరికంగా ఉంటుందని రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేశాడు. ఇప్పుడు అతను అన్న మాటలు ఏ వివాదాలకు దారి తీస్తాయో తెలియదు కానీ కొన్ని వర్గాల ప్రజలు మాత్రం ఆయన తీయబోయే చిత్రం పైన చాలా ఆసక్తిగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: