పారిజాత మూవీ క్రియేష‌న్స్‌, ట్రైడెంట్ ఆర్ట్స్ ప‌తాకంపై టి.అంజ‌య్య స‌మ‌ర్పిస్తున్న చిత్రం వ‌ద‌ల‌డు.  ఈ చిత్రానికి టి. న‌రేష్‌కుమార్‌, టి.శ్రీ‌ధ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  సాయిశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్రొడ్యూస‌ర్స్ సెక్టార్ చైర్మెన్ ఏలూరు సురేంద‌ర్‌రెడ్డి, ఫిల్మ్ ఛాంబ‌ర్ జాయింట్ సెక్ర‌ట‌రీ న‌ట్టికుమార్ సంయుక్తంగా  ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...


సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ...అంజ‌య్య‌గారు నాకు ప‌ది సంవ‌త్స‌రాల నుంచి ప‌రిచ‌యం ఆయ‌న‌కు మూవీ మీద చాలా ప్యాష‌న్ ఉంది. ఆయ‌న‌కు మూవీ హిట్లు, ఫ‌ట్ల‌తో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు అని అన్నారు.


అంజ‌య్య మాట్లాడుతూ... పారాజాత క్రియేష‌న్స్ ప‌తాకం స్థాపించి రెండు సంవ‌త్స‌రాల‌యింది. మా బ్యాన‌ర్‌లో మొద‌టి చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. కిల్ల‌ర్ త‌దిత‌ర‌ చిత్రాలు తీశాను. కె.కె. చిత్రం తో మంచి పేరొచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ గోల్ ఏదో ఆశించి సినిమాల‌ను ఎప్పుడూ తియ్య‌లేదు. మేం తీసిన గ‌త చిత్రాల‌న్నీ ప్ర‌తీ చిత్రం అంద‌రూ చూడ‌గ‌ల‌గాల‌ని మంచి మూవీస్ తీశాము. ఇక‌పైన కూడా త‌ప్ప‌కుండా అలాంటి చిత్రాలే తీస్తాము. రియ‌ల్ ఎస్టేట్‌లో ఎదిగాము అలాగే సినిమాల్లో కూడా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం అన్నారు.


ప్రొడ్యూస‌ర్ టి. శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ... ఈ సంవ‌త్స‌రం ఇది నా నాలుగ‌వ సినిమా వ‌ద‌ల‌డు దెయ్యం అయినా స‌రే అనేది ట్యాగ్ లైన్‌. ఏదో ఒక సోష‌ల్ ఎవేర్నెస్ మెసేజ్‌తో ఓరియంటెడ్ చిత్రాల‌ను తీస్తున్నాము. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ స‌మాజంలో ఏద‌న్నా ఒక విష‌యాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ప్ర‌ధానంగా యూత్ కార‌ణం. అలాంటి క‌ల్తీల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. హీరోయిన్ ఎలా క‌లిసింది. ఏం చేసింది. హీరోయిన్ హార‌ర్ ఎలిమెంట్స్ చాలా బాగా న‌టించింది. ఈ సినిమాకు 450 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.


మ‌రో నిర్మాత టి. న‌రేష్ కుమార్ మాట్లాడుతూ... మేం మంచి కాన్సెప్ట్ చిత్రాల‌ను నిర్మించ‌డానికి ఈ రంగంలోకి వ‌చ్చాము. ఆ బాట‌లోనే ప్ర‌యాణిస్తున్నాము అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: