టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.  నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివ ప్రసాద్ మరణ వార్త జీర్ణించుకోక ముందే మరో ప్రముఖ హాస్య నటుడు కన్నుమూశారు. టాలీవుడ్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకొని ఎన్నో హాస్య పాత్రలకు జీవం పోసిన కమెడియన్ వేణు మాదవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  వేణు మాధవ్ కన్నుమూసిన విషయం విని తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది.  చిన్న స్థాయి నుంచి కష్టపడి వెండి తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ ఇక లేరని తెలిసి తెలుగు హాస్య ప్రియులు కన్నీరు పెట్టుకున్నారు.

వేణు మృతి పట్ల సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వేణుమాధవ్ మృతికి సంతాపం తెలిపారు. గతంలో పవన్ కళ్యాన్ తో వేణు మాధవ్ పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమాలో అమ్మాయిలు గురించి మాట్లాడిన లెన్తీ లైలాగ్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పవన్ నటించిన సినిమాల్లో వేణు మాధవ్ ప్రత్యేక కామెడీ పాత్రల్లో నటించారు.  తాజాగా వేణు మాధవ్ మరణ వార్త విన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కన్నీరు పెట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులను నవ్వించిన వేణుమాధవ్ ఇక లేరు అనే విషయం దిగ్బ్రాంతికి లోను చేసింది.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారని అనుకున్నా.. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. గోకులంలో  సీత నుండి నాతో కలిసి పలు సినిమాల్లో నటించారని అన్నారు.  వేణుమాధవ్ మృతికి నా తరుపున, జనసైనుకుల తరపునా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, వేణు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: