అనారోగ్యంతో కారణంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన హస్యనటుడు వేణుమాధవ్..... సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాలో తన నటనతో అందరి మన్ననలు పొందాడు. ఆయన మృతి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అభిమానుల మనసు కలచి వేసింది. ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు వెల్లడించారు. ఆయన పుట్టిన రోజు ఏ నాడు కూడా కేక్ కట్ చేసే అలవాటు లేదట. సినీ ఇండస్ట్రీలో వచ్చిన మొదలు వేణుమాధవ్ తన పుట్టిన రోజు అనాథ అశ్రమంలో జరుపుకొనేవాడనని ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు. అదే రోజున ఆయన మిత్రులు ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేసేవాట. అయితే మెగాస్టార్ చిరంజీవి వల్ల ఓ సారి తన పుట్టిన రోజు రూల్స్ను బ్రేక్ చేశానని ఇంటర్వ్యూలో వెల్లడించాడు. జై చిరంజీవ సినిమా చిత్రీకరిస్తున్న సమయంలో పుట్టిన రోజు వస్తే మెగాస్టార్ చిరంజీవి కేక్ను తెప్పించి ఆయన సమక్షంలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేశారట.ఎప్పుడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని నేను చిరంజీవి వల్ల అలా కేక్ కట్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు వేణుమాధవ్
అయితే వేణుమాధవ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ మొదటి సారి నాతో కలిసి మాస్టర్ సినిమాలో నటించాడని గుర్తు చేశారు. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుపు తెచ్చుకున్నాడని తెలిపారు. కొన్ని పాత్రలు మాత్రం ఆయన కోసమే ఉన్నాయా.. అన్నట్లు నటించేవాడని అన్నారు. వయసులో చిన్నవాడ అయినా...సినీ పరిశ్రమలో ఆయనకంటే మంచి భవిష్యత్తు ఉన్న సమయంలోనే ఇలా అందరికి దూరమయ్యాడని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను’ అని చిరంజీవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.