తెలుగు సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న హస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుమారు 600లకు పైగా సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందాడు వేణుమాధవ్. టాలీవుడ్లోని అందరు టాప్ హీరోలతోనూ నటించే అవకాశం లభించింది. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిని సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సినీ హీరోలందరికంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో ప్రత్యేక అనుబంధం ఉంది. వేణుమాధవ్ సంప్రదాయం మూవీ ద్వారా సినీ రంగంలో ప్రవేశించినా .... తొలిప్రేమ సినిమా అతనికి స్టార్ కమెడియన్ని చేసేసింది. పవన్ కల్యాణ్, వేణుమాధవ్ కలిసి నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయనే చెప్పాలి. పవన్ కల్యాణ్ రెండో సినిమా గోకులంలో సీత మూవీలో వాలిద్దరు కలిసి మొదటిసారిగా నటించారు. అయితే పవన్ కల్యాణ్కు మంచి పేరు తీసుకువచ్చిన సినిమాలు సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు లాంటి సినిమాల్లోనూ వేణు మాధవ్ నటించాడు. అలాగే బంగారం, అన్నవరం, గుడుంబాశంకర్ లాంటి సినిమాల్లో కూడా వేణుమాధవ్కు నటించారు.
పవన్ కల్యాణ్ - వేణుమాధవ్ ఇద్దరి మధ్య ఒప్పందం ఇదే:
అయితే, పవన్ కల్యాణ్, వేణుమాధవ్ ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కూడా ఉందట. పవన్ కు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. స్వయంగా వ్యవసాయం చేస్తారు. పశుసంపదను పోషిస్తారు. వేణుమాధవ్ కూడా ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుతో తన సొంతూరులో పదెకరాలు పొలం కొని వ్యవసాయం చేసేవారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. వేణుకు ఇలా అన్నాడట. నీ పొలంలో పండిన పంటలో ప్రతి ఏటా ఓ బస్తా బియ్యం తనకు పంపాలని కోరారట. అందుకు వేణుమాధవ్ సరే అని చెప్పేశాడట. అప్పటి నుంచి వేణుమాధవ్ పవన్కు ప్రతి ఏటా బస్తా బియ్యం పంపుతున్నాడట. పవన్ కళ్యాణ్ కూడా తన తోటలో పండిన పండ్లను వేణుమాధవ్కి పంపేవారట.