యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "సాహో" ఎన్నో అంచనాల మధ్య విడుదల అయింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా అంచనాలను అందుకోలేక చతికిల పడింది. బాలీవుడ్ ని మినహాయిస్తే ఎక్కడ చూసినా బయ్యర్లకి నష్టాలనే మిగిల్చిందనే టాక్.


ఇక ఈ సినిమా బాలీవుడ్ లో ఒక ఊపు ఊపింది. విమర్శకులు ఈ సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చినప్పటికీ, ఉత్తరాది వారు ఈ సినిమాని బాగా ఆదరించారు. సాహో సినిమా ఒక్క హిందీలోనే 150 కోట్ల బిజినెస్ చేసింది. అన్ని చోట్ల మిశ్రమ టాక్ తెచ్చుకున్న ఒక సినిమాకి ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం ఆశ్చర్యకరమే! ఈ  కలెక్షన్లని చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు విస్మయానికి గురవుతున్నారు.


బాలీవుడ్ లో ముఖ్యంగా రెండు రాష్టాలలో ఈ సినిమా ఓ రేంజ్ లో లాభాలు సాధించిందని తెలుస్తుంది.ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రాలలో ఈ సినిమా దుమ్ము దులిపింది. ఒరిస్సా రాష్ట్రంలో బాహుబలి 2 తరువాత అంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సాహో నిలిచింది. కాగా బీహార్ లో కూడా సాహో చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. బీహార్ లో సాహో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఆరవ స్థానం దక్కించుకుంది.


ఒక దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకి మరో చోట ఇంతలా కలెక్షన్లు రావడం ఆసక్తికరం. దీంతో ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ అని మరోసారి రుజువైంది. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో  "జాన్" సినిమా చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా బేస్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: