టాలీవుడ్, బాలీవుడ్ సంచలన వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే కాంట్రవర్సీ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టి.డి.పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గా ఇటీవల ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలుంటాయ్.. సినిమా నేపథ్యమేమిటన్న విషయాలను ఇంతకముందే రివీల్ చేసేశారు ఆర్జీవీ. అయితే ఇప్పటి వరకూ మేల్ క్యారెక్టర్స్ ను మాత్రమే పరిచయం చేసిన వర్మ.. ఫీ-మేల్ లీడ్ క్యారెక్టర్స్ ను మాత్రం ఇప్పటివరకు పరిచయం చేయలేదన్న గాసిప్స్ వస్తున్న నేపథ్యంలో...ఆ గాసిప్స్ కి సమాధానంగా ఒక ఫ్రెష్ అప్డేట్ ను ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో వివాదాస్పద నటి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా చాలా పాపులర్ అయిన శ్రీరెడ్డి నటిస్తోందని తాజా సమాచారం. శ్రీరెడ్డి కి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఇచ్చారని తెలుస్తోంది. ఈ పాత్ర శ్రీరెడ్డికే ఇవ్వడానికి కూడా ఓ కారణం ఉందట. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో వివాదం చెలరేగినప్పుడు.. జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీనే విమర్శలు చేయించాడంటు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో శ్రీరెడ్డి కి ఆర్జీవీ ఒక ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో అందుకు రుణంగా ప్రస్తుతం 'క‌మ్మరాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు' సినిమాలో ఓ కీ రోల్ ఇస్తున్నాడట. శ్రీరెడ్డి చేసిన ఈ పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట. 

అయితే ఆ పాత్రేంటి..? అనేది మాత్రం చివరి వరకు ఎక్కడా రివీల్ కాకూడదని చాలా గోప్యంగా ఉంచుతున్నారట. గ‌తంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినీమాలో కూడా శ్రీరెడ్డి కి మంచి పాత్ర ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వర్మ ఎందుకనో ఆ సినిమాలో శ్రీరెడ్డి ని తీసుకోలేకపోయాడు. మరి తాజాగా వస్తున్న పుకార్లు ఏ మాత్రం నిజమవుతాయో చూడాలి. అయితే ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారడమే కాకుండా సోషల్ మీడియాలోను బాగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోల‌ు, సాంగ్స్‌ను కూడా ఆర్జీవీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి సినిమా కంప్లీటయి థియోటర్స్ వరకు వస్తుందా లేక ఏ.పి లో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా లాగా అడ్డంకులు ఎదురై వాయిదా పడుతుందా..లేక మొత్తానికే ల్యాబ్ లో ఉండిపోతుందా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: