అదేంటీ  కమెడియన్ వేణు మాధవ్ మృతిపై స్టార్ క్రికెటర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం ఎంటా అని అలోచిస్తున్నారా..? అవును ఆ క్రికెటర్ ఎవరో కాదు టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్. గత కొంత కాలంగా తెలుగు కమెడియన్ వేణు మాధవ్ కాలేయ, మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా డయాలసీస్ తీసుకుంటున్న ఆయన మంగళవారం మధ్యహ్నాం కన్నుమూశారు.  ఆయన మృతితో యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీరుమున్నీరు అయ్యింది. 

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్, డాక్టర్ రాజశేఖర్ దంపతులు, బ్రహ్మానందం, ఆలీ ఎంతో మంది టాలీవుడ్ కమెడియన్లు ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాప్పి వ్యక్తం చేశారు. నిన్న ఆయన భౌతికఖాయాన్ని ఫిలిమ్ ఛాంబర్ లో ఉంచి మౌలాలీలో అంత్యక్రియలు జరిపించారు. అయితే టాలీవుడ్ లో వేణు మాధవ్ ఇరవై ఏళ్లు తన హాస్యాన్ని పండించారు.  ఆయన లేని లోపం ఇక పూడ్చలేదని ఎంతో మంది తమ బాధను ట్విట్స్ రూపంలో తెలియబరిచారు.  తాజాగా ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కమెడియన్ వేణుమాధవ్ మరణ వార్త విని షాక్ అయ్యారట. ఈ మేరకు ట్వీట్ చేశాడు. వెండితెరపై తాను చూసిన మంచి హాస్యనటుల్లో వేణుమాధవ్ ఒకరని పేర్కొన్నాడు.

తెలుగు చిత్రసీమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని అన్నాడు.  వేణుమాధవ్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నాడు.  అంతా ఓకే కానీ.. వేణు మాధవ్ గురించి ఎక్కడో ఉన్న యూసుఫ్ పఠాన్ కి ఎలా తెలుసు.. బాలీవుడ్ లో ఎప్పుడూ వేణు మాధవ్ నటించలేదు కదా? మరి ఆయన గురించి ఏలా తెలుసు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.  అయితే, వేణుమాధవ్‌తో యూసుఫ్ పఠాన్‌కు  ఎలా పరిచయం అయిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: