యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ ల సాన్నిహిత్యం పై ఇప్పటికే ఎన్నో గాసిప్పులు వచ్చాయి. అయితే ఆ గాసిప్పులను ఎప్పటికప్పుడు వీరిద్దరూ ఖండిస్తూ ఉన్నా బుల్లితెర షోలలో వీరి సాన్నిహిత్యాన్ని చూసినవారు ఎదో ఎఫైర్ వీరిద్దరి మధ్య నడుస్తోంది అంటూ కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన సంకేతాలు ఒక రియాలిటీ షోలో ఏకంగా రేణు దేశాయ్ సాక్షిగా జరగడం బుల్లితెర ప్రేక్షకులకు మంచి జోష్ ను ఇస్తోంది. లేటెస్టుగా వీరిద్దరూ టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తున్న ‘ఢీ’ సీజన్ కు సంబంధించి ఒక ప్రోమోను ఈమధ్య రిలీజ్ చేసారు. 

ఈషోకు రేణు దేశాయ్ శేఖర్ మాష్టర్లు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ ప్రోమోలో ‘చిందేస్తూ మందెయ్ రా’ అనే పాటకు డాన్సర్‌లు డాన్స్ చేస్తూ సుధీర్‌ని తీసుకువచ్చి.. ‘ఎప్పుడో చెప్పడం కాదు.. ఇప్పుడు ప్రపోజ్ చేయి రష్మికి ఎందుకు ఒప్పుకోదో నేనూ చూస్తా’ అని ఒక డాన్సర్ అంటాడు.

అప్పుడు బ్యాగ్రౌండ్‌లో ‘కన్నుల్లోని రూపమే సాంగ్ ప్లే’ కావడం.. రష్మి సిగ్గుమొగ్గలేయడం అన్నీ ఫన్నీగా చూపించారు. ‘నువ్ ఊ అనకముందే ఐదు సంవత్సరాలనుండి ఆగుతున్నాడు.. నువ్ ఊ అంటే నీకోసం ఐదొందల సంవత్సరాలైనా ఆగుతాడు. అందరూ అనుకునేట్టుగా సుధీర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆగేది ఎవరికోసమే కాదు.. నీ కోసమే. నీకోటి చెప్పనా ప్రపంచంలో జన్యున్‌ గా ఉండేది తాగుబోతులు ఒక్కరే.. అలాగే మా సుధీర్ కూడా ఒక్కడే’ అంటూ సుధీర్, రష్మిలను ఏకం చేయడానికి ఆతాగుబోతు డాన్సర్ సినిమా డైలాగ్‌లు చెప్పగా.. రష్మి, సుధీర్‌ లు తెగ సిగ్గుపడిపోవడం చూసి రేణు దేశాయ్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను చాల హైలెట్ గా చూపెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ విడిపోయినా పవన్ అభిమానులలో ఆమెకు ‘వదిన’ స్థానం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో కొన్ని ఛానల్స్ రేణు దేశాయ్ ఇమేజ్ ని తమ కార్యక్రమాల రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఇలా వ్యూహాత్మకంగా వాడుకుంటూ రేణు దేశాయ్ ని పవన్ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగువారు కూడ మర్చిపోకుండా చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: