మూవీలో టాప్ హీరో అండ్ హీరోయిన్స్ నటించడమే కాదు, ఆ మూవీను ప్రమోషన్ చేసుకునే బాధ్యత కూడ వాళ్ళకు ఉంటుంది. ఇదంతా మూవీ సక్సెస్లోని భాగమే. అదే విధంగా కరీనాకపూర్ తన అప్కమింగ్ ఫిల్మ్ మూవీకు సంబంధించిన ప్రమోషన్స్లో పార్టిసిపెట్ చేసింది. అయితే అక్కడ కరీనా కపూర్కు చుక్కలు కనిపించాయి. అభిమానించాల్సిన అభిమానులే కరీనాను భయపెట్టారు.
కరీనాకపూర్, ఇమ్రాన్ఖాన్ నటించిన అప్కమింగ్ ఫిల్మ్ 'గోరి తేరి ప్యార్ మే' రిలీజ్ ఈ నెల 22న ఉంది. అందుకు ఈ మూవీను నార్త్ ఇండియాలోని ప్రముఖ సిటీలలో ప్రమోషన్ చేసేందుకు ప్లానింగ్స్ వేసుకున్నారు. అందులోని భాగంగానే జైపూర్ సిటిలోని ఓ కాలేజ్ను ఎంచుకున్నారు. ప్రమోషన్ జరగాల్సిన టైం కంటే గంట పాటు ఆ ప్రమోషన్ ఈవెంట్ ఆలస్యం అయింది. ఇకేముంది అక్కడ ఉన్న ఆకతాయి అభిమానులు అప్పటికే హీరోయిన్ కరీనాకపూర్, ఇమ్రాన్ఖాన్ల మీద జోకలు, సైటైర్లు వేసుకుంటూ అక్కడి వాతావరణాన్ని అల్లరి అల్లరిగా మార్చారు. గంట ఆలస్యంగా వచ్చిన హీరో,హీరోయిన్స్ అభిమానులకు ముందుగా టీ షర్ట్స్ను పంచే కార్యక్రమాన్ని చేపట్టారు.
కరీనాకపూర్ పెద్దగా సెక్యూరిటీ లేకుండా టీ షర్ట్స్ను అభిమాలను మధ్యలో పంచుతుంది. కొంత మంది అభిమానులు కరీనాను టీజ్ చేస్తూ, ఆమె దగ్గర ఉన్న టీ షర్ట్స్ను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో భయపడిన కరీనాకపూర్ తనకు సెక్యూరిటిగా ఉన్న బౌన్సర్ సహాయాన్ని కోరింది. వారు వెంటనే అభిమానులను చెధర గొట్టి, కరీనాకపూర్ను అక్కడ నుండి పంపించేశారు. ఆ విధంగా ఆ ప్రమోషన్ ప్లానింగ్ క్యాన్సిల్ అయ్యింది. కొంత మంది అయితే కరీనాకపూర్ను అక్కడే ఆ టీషర్ట్ను వేసుకోవాలని డిమాండ్ చేశారంట.
మరింత సమాచారం తెలుసుకోండి: