రెబల్ స్టార్  ప్రభాస్  బాహుబలి తో దేశ వ్యాప్తంగా  క్రేజ్ ను తెచ్చుకున్న  విషయం తెలిసిందే. ముఖ్యంగా  నార్త్ ఇండియా లో ఈ చిత్రం  ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. ఇక ఇటీవల  ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహు తెలుగు తోపాటు హిందీలోను భారీ స్థాయిలో విడుదలైంది.   హిందీ లో ఈ సినిమా చూసిన ప్రభాస్ లేడీ ఫ్యాన్ ఒకరు   సాహో లో విలన్ పాత్రలో  నటించిన  చుంకి పాండే ను చెప్పుతో కొట్టాలని అనుకుందట. ఈవిషయాన్ని ఎవరో కాదో స్వయంగా చుంకి పాండేనే  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో  వెల్లడించాడు. 



అసలు ఏమైందంటే  సాహో లో చుంకి పాండే , దేవరాజ్ అనే పాత్రలో  కరుడుగట్టిన  విలన్ గా నటించాడు.  అందులో భాగంగా సినిమాలో  ప్రభాస్ ను ముప్పు తిప్పల పెట్టేలా చేస్తాడు దేవరాజ్.  దాంతో  ఆ లేడీ ఫ్యాన్ కు ఎక్కడలేని  కోపం ఒచ్చింది.  ఇటీవల బయటికి వెళ్లిన  చుంకి పాండే కు అప్పుడే సాహో చూసి వస్తున్న ఆ లేడీ ఫ్యాన్ ఎదురైయింది.  ఇక అంతే కోపం పట్టలేక  ఆ మహిళ  చుంకి పాండే దగ్గరుకు  వచ్చి  మా బాహుబలి (ప్రభాస్) ని అంతలా ఇబ్బంది పెడతావా  అంటూ చెప్పు తీయబోయిందంట.. అయితే అదంతా సినిమాలో భాగమేనని  నిజం కాదని చుంకి  పాండే  ఆమహిళ ను సముదాయించి అక్కడి నుండి  తప్పించుకున్నాడట.  కానీ ప్రభాస్ ను అక్కడ కూడా ఇంతలా అభిమానించే  అభిమానులు వున్నారంటే  నిజంగా గొప్ప విషయమే.  ఇక  ఈచిత్రం అన్ని భాషల్లో  డిజాస్టర్ అయినా  హిందీలో మాత్రం  సూపర్ హిట్ అయ్యింది. దీన్ని బట్టి చెప్పొచ్చు ప్రభాస్ కు అక్కడ ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉందోనని.  

మరింత సమాచారం తెలుసుకోండి: