ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే వచ్చే సమాధానం పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో నాగ చైతన్య తో జత కడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయినా కూడా బాలీవుడ్ మీద మోజుతో టాలీవుడ్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అయినా మళ్ళీ తెలుగులో వచ్చి సెటిలయింది. ప్రస్తుతం పూజా చేతిలో మూడు సినిమాలున్నాయి. ఒక వైపు స్టార్ హీరోలతో జతకడుతూ ఇంకో వైపు కుర్ర హీరో సినిమా చేస్తుంది. లేటెస్ట్ గా 'గద్దల కొండ గణేష్' లో శ్రీదేవిగా కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ వచ్చే ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

ఇప్పటికే ప్రభాస్ తో 'జాన్' సినిమా చేస్తున్న పూజా హెగ్డే మరో వైపు బన్నీ తో 'అల వైకుంఠపురములో' చేస్తుంది. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా అఖిల్ సినిమా కూడా ఒప్పుకొని షూటింగ్ లో పాల్గొంటుంది. వీరిలో ఒక్క బన్నీ తోనే రెండోసారి, అలాగే దర్శకుడు త్రివిక్రంతో కలిసి రెండో సారి పనిచేస్తోంది. ఇక ప్రభాస్, అఖిల్ తో నటించడం ఇదే మొదటి సారి. ఇవి కాకుండా ఇంకో రెండు మూడు సినిమాల దర్శక, నిర్మాతలు పూజా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి 'మొహంజాదరో' సినిమా కోసం తెలుగులో ఆ మధ్య కొన్ని పెద్ద సినిమాలు వదులుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ 'డీజే'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇప్పుడున్న హీరోయిన్స్ కి గట్టి పోటి ఇస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. తెలుగులో పెద్ద సినిమా అంటే ముందుగా పూజానే సంప్రదిస్తున్నారు హీరో తో పాటు దర్శక నిర్మాతలు. ఒకవేళ పూజా నో అంటేనే ఇంకో హీరోయిన్ ని వెతుక్కుంటున్నారు తప్ప ముందుగా వేరే వాళ్ళని చూడటం లేదు. మరి పూజా ప్రస్తుతం తనకున్న ఈ స్టార్డంతో తెలుగులో ఎన్నేళ్ళు వెలుగుతుందో చూడాలి. మొత్తానికి ఒకేసారు ముగ్గురు, నలుగురు హీరోలకి డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తూ బాగానే డీల్ చేస్తోంది. ఏదేమైనా పూజా స్టామినా నే వేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: