టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గత ఏడాది వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో సినిమాలకు గుడ్ బై చెప్పి, ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకు అంకితమైన విషయం తెలిసిందే. అయితే ఆయన నటించిన అజ్ఞాతవాసి సినిమా, కెరీర్ పరంగా పవన్ కు సిల్వర్ జూబిలీ సినిమా కావడం, అదీకాక పవన్ ను ఎంతో ఇష్టపడే త్రివిక్రమ్ తో పవన్ ఆ సినిమా చేస్తుండడంతో అజ్ఞాతవాసిపై అందరికి విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ విధంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకుని పవన్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. 

కాగా అప్పటికే అజ్ఞాతవాసితో సినిమాలకు ఫుల్ స్టాప్ పెడదామని నిర్ణయించిన పవన్, దాని ఫలితం తేడాకొట్టినప్పటికీ కూడా లెక్కచేయకుండా పూర్తిగా రాజకీయ రంగంవైపు అడుగులు వేశారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ ఓడిపోవడం, అదీ కాక పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా గెలవకపోవడంతో ఇకపై పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే తన జీవితాన్ని గడపాలని, ఓడిపోయినప్పటికీ తాను ఎప్పటికీ ప్రజల మనిషినని, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని పవన్ అన్నారు. ఇకపోతే ఇటీవల పవన్ జన్మదినం సందర్భంగా ఆయన తన కొత్త సినిమాను ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావించారు. అయినప్పటికీ అదేమి కార్యరూపం మాత్రం దాల్చలేదు. 

ఇకపోతే రెండు రోజుల క్రితం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్, పవన్ ని కలిసినట్లు వార్తలు రాగా, నేడు ప్రముఖ తమిళ దర్శకుడు హరి మాత్రం మధ్యాహ్నం సమయంలో ప్రత్యేకంగా కలిసి దాదాపుగా రెండు గంటల పాటు మాట్లాడినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ, పవన్ మరియు హరి మాత్రం ఒక సినిమా విషయమై కలిసారని, హరి గారు పవన్ కోసం ఒక అద్భుతమైన స్టోరీని రెడీ చేసి వినిపించడం జరిగిందని, ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తారని టాక్. అయితే దీనిపై పూర్తి నిజనిజాలు వెల్లడికావలసి ఉంది.......!!


మరింత సమాచారం తెలుసుకోండి: