టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు వచ్చారు.  అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మహానటుడు ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా మారినా కొంత కాలం తర్వాత హరికృష్ణ రాజకీయాల్లోకి వెళ్లారు.  నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ హీరోగా కొనసాగుతూనే ఉన్నారు.  ఇక హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ లు హీరోలుగా మారినప్పటికీ..ఎన్టీఆర్ మాత్రం టాప్ హీరోగా నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు.  టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అతి భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. అయితే రాజమౌళితో ఎన్టీఆర్ ఇది నాలుగవ సినిమా.. జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 మూవీ రిలీజై ఇప్పటికీ 18 ఏళ్లు అయ్యింది.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ బ్లాక్ బస్టర్ అయ్యాయి.  ఇప్పడు ఆర్ఆర్ఆర్  మూవీ తెరకెక్కుతుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

18 ఏళ్ల క్రితం 'స్టూడెంట్ నెం.1' షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు.  ఈ 18 ఏళ్లలో ఎంతో మారిపోయింది కానీ, రాజమౌళితో కలిసి పనిచేస్తున్నప్పుడు లభించే వినోదం మాత్రం మారలేదని పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే అదే సమయానికి 18 ఏళ్లు  సరిగ్గా ఇదే రోజున స్టూడెంట్ నెం.1 రిలీజైంది. కాకతాళీయంగా మేము రామోజీ ఫిలింసిటీలో ఉన్నాం. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది, ఎన్టీఆర్ సన్నబడ్డాడు, నేను వయసు పైబడ్డాను" అంటూ రాజమౌళి ఫన్నీగా ట్వీట్ చేశారు. మొత్తానికి వీరిద్ది మనోభావాలు ఒక్కటే..ఇద్దరి కాంబినేష్ సూపర్ హిట్ కాంబినేషన్ అని అభిమానులు ఇద్దరికీ శుభాభినందనలు తెలుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: