టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ మరణం తెలుగు సిని పరిశ్రమను ఎంతగానే బాధపెట్టింది. తెలంగాణా ఆణిముత్యాలలో ఆయన ఒకరు. తెలుగు సిని పరిశ్రమలో వేణు మాధవ్ లాంటి కమెడియన్ చాలా ప్రత్యేకమైన వ్యక్తని అందరు అన్నారు. అయితే వేణు మాధవ్ మరణించిన తర్వాత ఆయన గురించి షకీలా ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 


బీ గ్రేడ్ సినిమాలను మానేసిన షకీలా తెలుగులో కొన్ని కామెడీ సినిమాల్లో నటించింది. బ్రహ్మానందం, వేణు మాధవ్, అలిలతో కలిసి నటించింది ఆమె. అయితే వేణు మాధవ్ తో షకీలా చాలా క్లోజ్ గా ఉంటుందని ఆమె చెప్పారు. వేణుని అరేయ్ అనేంత చనువు ఉందట. వారిద్దరి స్నేహం కూడా చాలా గొప్పదని అంటుంది షకీలా.   


ఓ సినిమా షూటింగ్ టైంలో వేణు మాధవ్ తను ఒకే గదిలో ఒకే బెడ్ మీద పడుకోవాల్సి వచ్చిందని. ఆ టైంలో తల క్రింద్ద దిండులను తీసి తన మధ్య వేణు మాధవ్ మధ్య పెట్టాడని అన్నది. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటే నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని.. నువ్వు నా మీద కాలు వేస్తే ఎలా అని ఆటపట్టించాడట. ఆ సన్నివేశం ఎప్పుడు తలచుకున్నా నవ్వుకొస్తుందని అన్నారు షకీలా. 


వేణు మాధవ్ చాలా మంచి మనిషని అందరు చెబుతున్నారు. షకీలా కూడా వేణుకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. వేణు మాధవ్ మరణించిన సమయంలో సెలబ్రిటీస్ కూడా అతని గురించి చాలా గొప్పగా మాట్లాడారు. సినిమాలో తనకేదైనా వేషం దొరికితే తన పక్కన ఏ చిన వేషం ఉన్నా తనకు తెలిసిన వారికి తెలుగు వారికి ఇప్పిస్తాడని అందరు చెప్పారు. అంతేకాదు ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ సినిమాల్లో నటిస్తే వారికి డబ్బులిస్తే తాగుతాడని ఇంటికి బియ్యం, పప్పులు లాంటివి పంపించేవాడట. అంతటి మంచి మనసున్న వేణు మాధవ్ ఇప్పుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమే అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: