దక్షిణాదికి చెందిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించబోయే డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి అనుష్క తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు. కోలీవుడ్ నుంచి కార్తీ, జయంరవి, విక్రమ్, టాలీవుడ్ నుంచి మోహన్బాబు, మాలీవుడ్ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి వారు కూడా నటించనున్నారు.
వీరందరితో పాటు ఈ సినిమాలో నటించేందుకు మొదట ఓకే చెప్పిన అనుష్క... ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటిగా తనేంటో రుజువు చేసుకుని, హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న అనుష్క కోసం ఇప్పటికీ దర్శకులు లైన్లో నిలుస్తుంటారు. ఆమె చాలా సెలక్టివ్గా సినిమాలు ఎంచుకునే అనుష్క ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుండి తప్పుకోడానికి బలమైన కారణం కూడా ఉంది.
అది ఆ చిత్రానికి తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు పాటలు రాస్తుండటమే. ఇతని మీద గత ఏడాది పెద్ద ఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని ఆయన ఎలా వేధించిందీ వివరించింది. ఆమెతో పాటు మరికొంత మంది గొంతు కలిపారు. ఎంతోమంది అమ్మాయిలు వైరముత్తు పెద్ద సైకో అని ఆరోపణలు చేశారు. దీంతో వైరముత్తుకు వ్యతిరేకంగా చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తోంది. కానీ తమిళ ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఆయనకు అండగా నిలుస్తున్నారు. యధావిధిగా ఆయనకు అవకాశాలు ఇస్తునే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితిలో అనుష్క చిన్మయ కు మద్దతుగా.. వైరముత్తుకు వ్యతిరేకంగా మణిరత్నం సినిమా నుంచి తప్పుకుందని అంటున్నారు అనుష్క సన్నిహితులు. ఇలా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పని చేస్తున్న సినిమాలో తాను నటించలేనని ఖరాకండిగా చెప్పేసిందని సమాచారం. ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’ అనే బహు భాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.