ప్రపంచ దేశాలోనే అత్యధికంగా తుపాకులు కలిగివున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా. ఆ దేశంలో జరిగే తుపాకి కాల్పులలో అధికంగా బలైపోతున్నవారు భారతీయులేనని ఇటీవలి గణాంకాల జాబితా చెబుతోంది. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ‘కిక్’ శ్యామ్ హీరోగా సారథి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘వాడొస్తాడు’. కె.వి.శబరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం అమెరికాలోని లాస్ వేగాస్లో హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించుకోవడం విశేషం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దర్శకుడు లింగుస్వామి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో మంచి వ్యూస్తో దూసుకెళ్తోంది. అక్టోబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...‘‘ఇందులో హీరోగా శ్యామ్ ఒక డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్గా ఆత్మీయ నటిస్తోంది. మరో హీరోయిన్గా శ్రీదేవి కుమార్ నటించారు. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు , తమిళ సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో చిత్రీకరించాం. స్టోరి సినిమాకు హైలెట్గా నివనుంది. అన్ని కార్యమాలు పూర్తి చేసి అక్టోబర్లో సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
సారథి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని జూలై 15 న ప్రముఖ కొరియా గ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కె. వి.శబరీష్, సారథి లు మాట్లాడుతూ.. అడగగానే 'వాడొస్తాడు' మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన లారెన్స్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హీరో శ్యామ్ ఈ 'వాడొస్తాడు' చిత్రంతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ చిత్రంలో శ్యామ్ కి జంటగా ఆత్మీయ, శ్రీదేవి కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ ఆర్టిస్ట్స్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా..సినిమాని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాము...అని అన్నారు.
కిక్ శ్యామ్, ఆత్మీయ, శ్రీదేవి కపూర్, శ్రీనాథ్, జస్టిన్ వికాజ్(హాలీవుడ్), లూకాస్ శాండ్రాస్ (హాలీవుడ్) తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:ఎన్ఎస్ రాజేష్కుమార్; సంగీతం:ఎమ్ఎమ్; ఎడిటింగ్: ఏకెడి అరుణ్ థామస్; ఆర్ట్: టియన్ కపిలన్; స్టంట్స్: శివ; పాటలు :వనమాలి; సంభాషణలు :కృష్ణతేజ. దర్శకత్వం:సారథి ; నిర్మాత: కె.వి.శబరీష్.