సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకొని.. తాజాగా సరిలేరు నీకెవ్వరూ చిత్రం తో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతోన్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కంప్లీట్
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండడంతో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
అభిమానులు మహేష్ సెంటిమెంట్ గట్టిగా నమ్ముతున్నారు. అదేంటి అంటే..2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తరువాత మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. మహేష్ కెరీర్లో సంక్రాంతి బరిలో దిగింది కేవలం ఐదు సార్లే. ఫస్ట్ టైం సంక్రాంతి బరిలో టక్కరి దొంగ చిత్రం వచ్చింది. కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమాను మంచి ప్రశంసలు దక్కాయి.
ఇక 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తరువాత 2013లో పూరి తెరకెక్కించిన బిజినెస్ మెన్ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2014లో సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే ప్లాప్ ఐయ్యింది. అయితే ఈ సినిమా మహేష్ కెరీర్లోనే భిన్నమైన సినిమాగా ఉందన్న ప్రశంసలు దక్కించుకుంది.
ఇప్పుడు మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీతో మరోసారి మహేష్ సంక్రాంతికి వస్తుండడం తో ఈసారి మహేష్ హిట్ కొట్టబోతున్నాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మహేష్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి. ఇక ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ యేడాది సంక్రాంతికి ఎఫ్ 2 రూపంలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.