భారత క్రికెట్ ఆటగాడు  కోహ్లీ అంటే తెలియని వారుండరేమో.. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఈ కుర్రాడు తీసిన సెంచరీలు, కొట్టిన హెలికాఫ్టర్ షార్టులు అందరిని అబ్బురపరుస్తున్నాయి. ఇకపోతే క్రికెట్ లోనే కాకుండా స్టార్ గుర్తింపు తెచ్చుకున్న విరాట్ ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నాడు. అలా బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి హెడ్ అండ్ షోల్డర్ ప్రకటనలో నటించారు. ఆ యాడ్ కాస్త వారి ప్రేమకు తెర తీసింది. అలా ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన నీతోనే నేనుంటాను అన్నట్లు ఒకరి విడిచి ఒకరు ఉండలేక తిరిగారు. 



మ్యాటర్లోకి వెళితే.. కోహ్లీ గురించి కొన్ని నమ్మలేని నిజాలను అనుష్క వెల్లడించింది. అవేంటంటే.. నన్ను ఎప్పుడు గర్వపడేలాచేస్తాడు. కొత్త ఆటాగాళ్లను ఎప్పుడు ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. ఇకపోతే తాజాగా ముంబైలో జరిగిన ఇండియన్‌ స్పోర్ట్స్ హానర్స్‌-2019 అవార్డుల కార్యక్రమానికి తన భర్త కోహ్లితో కలిసి అనుష్క శర్మ హాజరయ్యారు. 



అనుష్క మాట్లాడుతూ.. కొత్త క్రీడాకారులను ప్రోత్సహించడంలో నా భర్తకు ఇష్టం అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నేను చాలా గర్వాంగా ఫీల్ అవుతున్నాను. ఇకపోతే కొత్త ఆటగాళ్లను తీసుకురావడంలో ఆర్పీ- సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌, విరాట్‌ కోహ్లి ఫౌండేషన్‌ 2017లో ఇండియన్‌ స్పోర్ట్స్ హానర్స్‌ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సీనియర్ ఆటగాళ్లు వ్యవహరిసున్నారు. 




మొన్న జరిగిన ఆ కార్యక్రమానికి హాజరైన కోహ్లీ మాట్లాడుతూ... కొత్త వాళ్ళను వెలుగులోకి తీసుకు రావడంలో భారతదేశం ఎప్పుడు ముందుంటుంది. అందుకే ఇయర్ కి ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు దేశం గరించేలా చేయడంలో ముందుంటారు. వారికి సరైన జీహాలు ఇస్తే చాలు అని కోహ్లీ వెల్లడించారు. ఆ కార్య క్రమానికి భారత ప్రస్తుత ఆటగాళ్లు అందరు హాజరయ్యారు. ఏది ఏమైనా ఆ కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కోహ్లీ జంట నిలబడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: