టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా హీరోలతో పలు సినిమాలు తీసిన విషయం తెలిసిందే.  పవన్ కళ్యాన్ తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఇక అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ కృష్ణమూర్తి ప్రస్తుతం అలావైకుంఠపురములో తీస్తున్నారు.  ఒకప్పుడు మెగా హీరోలకు త్రివిక్రమ్ సినిమాలు బాగా సక్సెస్ ఇచ్చేవని టాక్ కూడా వినిపించేది.  అయితే మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, మళియాళం,కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.  ఈ మూవీ తర్వాత కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరో మూవీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో డ్యూయల్ రోల్స్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని చెప్పిన చిరు కొరటాల శైలిలో మంచి సందేశాత్మక చిత్రంగా సినిమా తెరకెక్కనున్నట్లు వివరణ ఇచ్చారు. 

అల్లు అర్జున్ మూవీ తర్వాత వెంకటేష్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో త్రివిక్రమ్ వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ కూడా నటించే అవకాశం ఉందని తెలియడంతో త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది.  ఈ నేపథ్యంలో ఒక లైన్ చెప్పిన త్రివిక్రమ్ పూర్తి కథను సిద్ధం చేశాక మరోసారి చర్చలు జరుగుతాయని ఆ కథ మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కే అవకాశం ఉందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: