యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.  జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై  ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న 'ఇద్దరి లోకం ఒకటే'.  కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో  కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ఒకటి. అయితే 'ఇద్దరి లోకం ఒకటే'  సినిమాకి సంబంధించి  ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట.  ఇక ‘దిల్‌’రాజు,  ‘‘రాజ్‌ తరుణ్‌ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ఇది.  యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి  నచ్చేలా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు.  ఇక  ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన  'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' సినిమాతో  హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో  వస్తోన్న మరో  సినిమాను త్వరలోనే మొదలెట్టనున్నాడు.  మరి ఈ రెండు సినిమాలు కూడా పోతే ఇక  రాజా తరుణ్ హీరోగా కొనసాగడం కష్టమే.   


అయితే   జయ్ కుమార్ తో చేస్తోన్న  చిత్రం కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతూ  మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో  సినిమాలో ఫుల్  కామెడీని పండిస్తుందట.  ఒకవిధంగా  'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' సినిమాలో కూడా ఈ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీనే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు అదే ఫార్ములాని ఈ డైరెక్టర్ మళ్ళీ ఫాలో అవ్వబోతున్నాడు.   ఎలాగూ రాజ్ తరుణ్ కి మంచి టైమింగ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాలో 'కామిక్ వే'లో సాగే స్క్రీన్ ప్లేతో.. తన సినిమాలో  కామెడీనే హైలెట్ గా నిలిచేలా  చూసుకుంటున్నాడట ఈ డైరెక్టర్. మెయిన్ గా  లవ్ స్టోరీ  ఫుల్ ఫన్ తో వైవిధ్యంగా  ఉంటుందట. గాలికి తిరిగే ఓ కుర్రాడు  తన కన్నా వయసులో పెద్దదైన  ఓ అమ్మాయిని ఇష్టపడితే.. ఆ తరువాత జరిగే నాటకీయ పరిణామాలు ఏమిటి ?  ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో అతను ఏమి చేశాడు ? ఇలా  ముదురు భామతో సాగే ప్రేమతో   సినిమా  చాల బాగుంటుందట.  అయితే రాజ్ తరుణ్ కు  హిట్ వచ్చి చాలా కాలమే  అయిపోయింది.   గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మొత్తానికి రెండు సినిమాలతో రాబోతున్నాడు. మరి ఈ సినిమాలతోనైనా ఈ యంగ్ హీరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: