తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు , సుధీప్ కీలక పాత్రల్లో నటించగా సుమారు 270కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ ఫై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే ఈచిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రం ఏకంగా 1800 స్క్రీన్ లకు పైగా విడుదలవుతుంది. దాంతో మొదటి రోజు ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టేలా కనిపిస్తుంది. ఇక బెంగుళూరు సహా ఇతర ప్రాంతల్లో ఉదయం 3:05గంటలకే సైరా షోస్ ప్రారంభం కానున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎక్స్ట్రా షో లకు పర్మిషన్ రావల్సివుంది.