ప్రస్తుతం దేశమంతా చర్చించుకుంటున్న సినిమా ఏదైనా ఉందంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా.. నరసింహారెడ్డి గురించే. ప్రమోషన్లు ఆలస్యమయ్యాయని భావిస్తున్న తరుణంలో చాలా స్పీడ్ గా.. సినిమా రిలీజ్ కు దగ్గరలో చిరంజీవి – చరణ్ ఇస్తున్న ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు ప్రేక్షకులకు బాగానే చేరుతున్నాయి. బెంగళూరులో ఈరోజు ఏర్పాటు చేసిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి తమన్నాను పొగుడుతూ నయనతారకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

 


చిరంజీవి మాట్లాడుతూ.. “తమన్నా ఈ సినిమాలో నటించడమే కాకుండా ప్రతి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉంది. హైదరాబాద్, ముంబయ్ తో సహా ఇప్పుడు బెంగళూరుకు కూడా వచ్చి తన వంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. తను ప్రమోషన్లకు రాదేమో అనుకున్నాను.. సినిమా అయిపోయాక తమ వంతు బాధ్యత అయిపోతుంది. ప్రమోషన్లతో వాళ్లకు సంబంధం ఉండదు. కానీ.. ఈ సినిమాను బాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోకి తీసుకెళ్లాలనే తన సదుద్దేశం మెచ్చుకోదగినది” అంటూ తమన్నాను మెచ్చుకున్నారు. నయనతార ఈ సినిమాకు సంబంధించి ఏ ప్రమోషన్ లోనూ పాల్గొనలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత అసలు తన ఉనికే లేకుండా ఉంటోంది. ఇంత భారీగా ఖర్చుపెట్టిన సినిమాకు మెయిన్ హీరోయిన్ రాకపోవటం ఎంతలేదన్నా యూనిట్ ను బాధించేదే. చిరంజీవి వ్యాఖ్యలు నర్మగర్భంగా నయనతారను ఉద్దేశించి అన్నట్టే ఉన్నాయి.

 


కన్నడంలో చిరంజీవికి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ ఫంక్షన్ తో ప్రూవ్ అయింది. చిరంజీవి కన్నడలోనే “కన్నడ ప్రజలకు నమస్కారం.. అందరూ బాగున్నారా.. నేనూ బాగున్నాను” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ధియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: