తాజాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ తో బిగ్ బాస్ 11వ వారం లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ అదరగొట్టే రీతిలో జరిగింది. బిగ్ బాస్ ఇంటినుండి ఎలిమినేట్ అవటానికి ఎన్నికైన నలుగురు సభ్యులు శ్రీముఖి, బాబా భాస్కర్, రవిక్రిష్ణ, వరుణ్ సందేశ్‌లు. అయితే శనివారం జరిగిన ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్ సేవ్ అయ్యారు. కాగా ఆదివారం జరిగిన షోలో ఎలిమినేషన్ ప్రక్రియలో  శ్రీముఖి, బాబా భాస్కర్, రవిక్రిష్ణ, ఈ ముగ్గురు మిగలటం జరిగింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయకముందు ఇంటి సభ్యుల చేత ఎప్పటిలాగానే యాంకర్ నాగార్జున అదరగొట్టే ఆటలు ఇంటి సభ్యుల చేత ఆడించడం జరిగింది.


అయితే ఇంటిలో మొత్తం మాటల అయిపోయాక ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న సందర్భంగా వచ్చిన సందర్భంలో ముందుగా శ్రీముఖి సేవ్ అయినట్లు ప్రకటించి తర్వాత భాస్కర్ మరియు రవికృష్ణ మధ్య ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని విషయంలో బిగ్ బాస్ హౌస్ సభ్యులను అందరిని ఉత్కంఠభరితంగా టెన్షన్ పుట్టించే విధంగా యాంకరింగ్ చేసి చివరాకరికి రవికృష్ణ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు. పదో వారంలో వితికాతో తలపడి నామినేషన్స్ లోకి వచ్చిన అతడికి ఫాలోయింగ్ తక్కువగా ఉండడంతో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి.


కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ వారం రవి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అవ్వడంతో వారి ఊహకు తగ్గట్లే బయట పరిస్థితులు కూడా కనిపించాయి. సో.. ఈ వారం రవికృష్ణ అనుకుంటే ఎలిమినెట్ అయ్యి పునర్నవి పై బిగ్ బాంబ్ వేశాడు. ఇక హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ బట్టలు మొత్తం పునర్నవి ఉతకలని నాగార్జున టాస్క్ విధించారు. మొత్తం మీద బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం మొత్తం మారిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: