భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకి వసుమతి గా పరిచయమైన భామ కియారా అద్వానీ. బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో హిట్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో లక్కీ క్వీన్ గా కంటిన్యూ అవుతోంది. వరసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమా తర్వాత రామ్ చరణ్ తో 'వినయ విధేయ రామ' సినిమా లో నటించింది. ఆ తర్వాత తిరిగి బాలీవుడ్ చెక్కేసింది. తెలుగులో హిట్ అయిన' అర్జున్ రెడ్డి' సినిమా రీమేక్ గా'కబీర్ సింగ్' పేరుతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అమ్మడి అదృష్టం ఒక‌టేసారి స్పీడందుకుంది. సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే కియారా ప్రస్తుతం ఇటలీలో ఉంది. అక్కడ అందమైన లొకేషన్లలో ఫొటోలు దిగుతూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా చిలకలా కిలకిల నవ్వుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది కియారా. డ్రెస్ కు మ్యాచింగ్ గా ఉండే వైట్ కలర్ బ్యాగ్.. కళ్ళకేమో వైట్ కలర్ గాగుల్స్ ధరించి తన జుట్టును సవరించుకున్నట్టుగా పోజిచ్చింది.ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "బ్యూటిఫుల్ ఫుల్ ఫుల్".. "ప్రీతి ఈ ఆల్వేస్ ప్రెట్టీ".."ఫెంటాస్టిక్ స్మైల్" అంటూ కొందరు పొగడ్తలు కురిపించారు.


వినయ విధేయ రామ సినిమాలో మాత్రం ఒక రేంజ్‌లో రెచ్చిపోయి తన అందాల ప్రదర్శనతో హీట్ ఎక్కించింది. దాంతో ఆమెకి ఇక్కడ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. కానీ వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అవ్వడం వల్ల ఇక్కడ ఛాన్సులు రాలేదు. అయితే అదే టైమ్ లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో సూపర్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమాలో అస్సలు మొహమాటపడకుండా ముద్దులు పెడుతూ, బోల్డ్ సీన్స్‌తో మత్తెక్కించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: