మెగాహీరో వరుణ్ తేజ్ తో వెంకీ అట్లూరి  తెరకెక్కించిన చిత్రం తొలిప్రేమ.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అనిపించుకుంది.  ఈ చిత్రంతోనే  వెంకీ  అట్లూరి  డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.  ఇక ఇప్పుడు మరో సారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది.  ఇటీవల వెంకీ ,వరుణ్ కు కథ వినిపించాడట. ఆకథ బాగా నచ్చడంతో  వరుణ్ వెంటనే సినిమా ఓకే చెప్పాడని సమాచారం. ఇది కూడా రొమాంటిక్ ఎంటర్ టైనరే అని తెలుస్తుంది.  ప్రముఖ నిర్మాత  దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు.  ప్రస్తుతం వరుణ్  తేజ్ ,కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు తో బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఇక వెంకీ అట్లూరి ప్రస్తుతం   నితిన్ తో రంగ్ దే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈఇద్దరు  ఈసినిమాలను పూర్తి చేశాక  తమ కాంబినేషన్ లో  రానున్న చిత్రాన్నిమొదలు పెట్టనున్నారు. 



ఇక ఈ ఏడాది ఎఫ్ 2 తో  బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన   వరుణ్ తేజ్ ఇటీవల  గద్దల కొండ గణేష్ తో ప్రేక్షకుల ముందుకు  వచ్చాడు. ఈచిత్రంతో మొదటి సారి తన కెరీర్ లో మాస్ జోనర్లో సినిమా చేసి  వరుణ్ తేజ్ తనను తాను నటుడిగా  నిరూపించుకున్నాడు. ప్రస్తుతం  ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే వసూళ్లను రాబడుతుంది. అయితే  ఈ సినిమాను   కరెక్ట్ టైం లో విడుదలచేసి ఉంటే  బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేదే.  ఆలా కాకుండా  సైరాకు 12రోజుల ముందు విడుదలచేయడం తో  గద్దల కొండ గణేష్  బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం గానే కనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: