పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తాను స్థాపించిన జనసేన పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా ఉండేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన ప్రజా పోరాటాల్లో పాల్గొంటూ సరి కొత్త రాజకీయాలకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాను స్థాపించిన జనసేన పార్టీని బలోపేతం చేయటానికి అన్ని విధాలా కృషి చేస్తూ మరోపక్క పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. దాదా పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందు తన స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన అజ్ఞాతవాసి సినిమా ఇప్పుడు తాజాగా సరికొత్త రికార్డ్ సృష్టించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.


త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకు ఉన్న చాలామంది బయ్యర్లకు నష్టం వచ్చింది. మొట్ట మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా ఊహించని విధంగా ప్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో చాలా నష్టం వాటిల్లింది సినిమా కొన్నవారికి. ఇటువంటి సినిమా తాజాగా యూట్యూబ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. సాధారణంగా మన తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే నార్త్ జనాలు ఎగబడి చూస్తుంటారు.


ఇక పవర్ స్టార్ సినిమాలకు ముందు నుంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు అజ్ఞాతవాసి 100 మిళియన్ల వ్యూవ్స్ ని అందుకొని పవర్ స్టార్ కెరీర్ లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. తెలుగులో హారిక హాసిని ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థ హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో ఎవడు 3 టైటిల్ తో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో సినిమాకి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినిమా కథలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ రికార్డులు సృష్టిస్తున్న నేపద్యంలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: